History of guru nanak images in telugu
Guru Nanak Jayanti 2022 గురు నానక్ జయంతిని ఎందుకు జరుపుకుంటారో తెలుసా...
Authored byఎస్.వెంకటేష్ | Samayam Telugu | Updated: 8 Nov 2022, 11:01 am
Subscribe
Guru Nanak Jayanti 2022 గురు నానక్ జయంతిని గురు పురబ్ లేదా ప్రకాష్ పర్వ్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ పవిత్రమైన పర్వదినాన గురునానక్ దేవుడు జన్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఈ సందర్భంగా దేశ విదేశాలలో ఉండే సిక్కులందరూ గురువుకు సంబంధించిన కీర్తనలు, వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తారు.
సిక్కు సమాజంలో మొత్తం 10 గురువులు ఉన్నారు. వీరందరిలో మొట్టమొదటి గురువు గురునానక్.
శ్రీ గురు నానక్ జీ సిక్కు మతాన్ని బలోపేతం చేయడంలో కీలకమైన పాత్ర పోషించారు.
సిక్కు మత స్థాపకుడు..
సిక్కులకు సంబంధించిన 10 మంది మత గురువులలో తొలి వ్యక్తి అయిన ‘గురు నానక్ దేవ్ జీ’ 15 ఏప్రిల్ 1469న పంజాబ్ రాష్ట్రంలోని తల్వాండిలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు కళ్యాణ్ చంద్ దాస్ బేడి, వీరిని కళ్యాణ్ దాస్ మెహతా, మాతా త్రిప్తి అని కూడా పిలుస్తారు.
Chandra Grahan 2022 చంద్ర గ్రహణం తర్వాత ఏ రాశి వారు ఏమి దానం చేస్తే శుభ ఫలితాలొస్తాయంటే...!
గురు నానక్ హిందూ, ఇస్లాం మతాల గురించి లోతైన జ్ఞానాన్ని పొందాడు. ఈ జ్ఞానంతోనే 15వ శతాబ్దంలో సిక్కు మతాన్ని స్థాపించాడు. గురునానక్ దేవ్ బోధనలు సిక్కు ప్రజల పవిత్ర గ్రంథమై గురు గ్రంథ్ సాహిబ్ లో భద్రపరిచబడ్డాయి.
గురునానక్ బోధనల్లో మంచితనం, స్వచ్ఛత, నిస్స్వార్థ సేవ, ధర్మం ఆధారంగా వివిధ సూత్రాలు ఉన్నాయి. తన బోధనల ప్రకారం విశ్వానికి సృష్టికర్త ఒక్కరే అని వివరించబడింది. ఎలాంటి జనాభా తేడాలతో సంబంధం లేకుండా అందరికీ మానవత్వం, శ్రేయస్సు, సామాజిక న్యాయం కోసం నిస్స్వార్థ సేవను ప్రచారం చేస్తాయి. సిక్కు మతంలో పునర్జన్మ భావనలను నిషేధిస్తుంది.
గురు నానక్ జయంతి వేడుకలు..
పంజాబ్ రాష్ట్రంలోని గురుద్వార్ లో గురు నానక్ జయంతికి రెండ్రోజుల ముందు వేడుకలు ప్రారంభమవుతాయి. గురుద్వారాస్ లో అఖండ మార్గంగా పిలువబడే గురు గ్రంథ్ సాహిబ్ గురించి 48 గంటల పాటు నిరంతరాయంగా పఠనం జరుగుతుంది. ఆ తర్వాత పండుగకు ఒక రోజు ముందు నాగర్కీర్తన జరుగుతుంది. దీనిని పంజ్ ప్యారే అని పిలుస్తారు. సిక్కులకు సంబంధించి త్రిభుజాకార జెండా, నిషాన్ సామిబ్, నాగర్కీర్తన సమయంలో సిక్కు మతం యొక్క పవిత్ర మత గ్రంథమైన గురు గ్రంథ్ సాహిబ్ పల్లకీలో ఉంచుతారు. ఆ తర్వాత ఘనంగా ఊరేగింపు నిర్వహిస్తారు.
గురు నానక్ సూత్రాలు..
గురునానక్ దేవ్ జీ ప్రకారం సిక్కు మతంలో మూడు మార్గదర్శక సూత్రాలున్నాయి. అందులో మొదటిది నామ్ జపన(దేవుడిని ఎప్పటికీ స్మరించుకోవడం), కిరాత్ కర్ణ(నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండటం), వంద్ చకనా(మీతో ఉన్న దానిని ఇతరులతో పంచుకోవడం)
Read Latest Religion News and Telugu News
రచయిత గురించిఎస్.వెంకటేష్ఎస్.వెంకటేష్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మిక రంగాలకు సంబంధించి కొత్త విషయాలను, మిస్టరీలను, ప్రత్యేకమైన సమాచారాన్ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, క్రీడలు, ఫీచర్స్, లైఫ్స్టైల్(జీవన శైలి)కు సంబంధించిన సమాచారాన్ని అందించారు.... ఇంకా చదవండి